Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్, పాకిస్థాన్‌‌ల మధ్య కీలక ఒప్పందం.. కాల్పులు ఆగుతాయా?

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (21:29 IST)
భారత్, పాకిస్థాన్‌‌ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు పాల్పడకూడదని భారత్, పాకిస్థాన్‌లు ఒక ఒప్పందానికి వచ్చాయి. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో క్రాస్ బోర్డర్ ఫైరింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి ముగింపు పలకాలనే యోచనలో ఇరు దేశాల అత్యున్నత మిలిటరీ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలల్లో ఇరు దేశాలు ఈ నిర్ణయానికి వచ్చాయి.
 
చర్చల అనంతరం ఇరు దేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. వాస్తవానికి ఇండియా, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 2003లోనే కుదిరింది. అయినప్పటికీ, పాక్ ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, పాక్ నిరంతరం కాల్పులకు తెగబడుతోంది. 
 
పాక్ కాల్పుల వల్ల సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఏదేమైనప్పటికీ.. తాజా ఒప్పందం వల్ల పాక్ లో కొంచమైనా మార్పు వస్తుందని భావిస్తున్నట్టు ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక అధికారి తెలిపారు. పాక్‌లో మార్పు వస్తే సరిహద్దుల్లో శాంతి నెలకొంటుందని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments