Webdunia - Bharat's app for daily news and videos

Install App

గత మూడేళ్లలో 329 పులులు మృత్యువాత : కేంద్రం

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (15:50 IST)
దేశ వ్యాప్తంగా గత మూడేళ్ల కాలంలో 329కి పైగా పులులు మృతి చెందినట్టు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా, మంగళవారం లోక్‌సభలో పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇందులో గత మూడేళ్ళ కాలంలో మొత్తం 329 పులులు చనిపోయాయని తెలిపారు. 
 
గత 2019లో 96 పులులు, 2020లో 106, 2021లో 127 చొప్పున ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. వీటిలో ప్రకృతి విపత్తుల కారణంగా 69, ఇతర కారణాల వల్ల 35, వేటాడటం వల్ల 29 చనిపోయినట్టు ఆయన వెల్లడించారు. మిగిలిన 197 పులుల మృతిపై విచారణ జరుగుతుందని చెప్పారు. 
 
ప్రధానంగా గత 2019 కంటే 2021లో పులుల వేట గణనీయంగా తగ్గిందన్నారు. పులుల వేట సాగించే సమయంలో 125 మంది వేటగాళ్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అలాగే, గత మూడేళ్లలో 307 ఏనుగులు విద్యుదాఘాతం, రైలు ప్రమాదాలు, అనారోగ్యం, వేటాడటం వల్ల చనిపోయాయని వివరించారు. 
 
వీటిలో 222 ఏనుగులు విద్యుదాఘాతానికి చనిపోగా, వీటిలో ఎక్కువగా ఒరిస్సా రాష్ట్రంలోనే 41, తమిళనాడులో 34, అస్సాంలో 33 చొప్పున ఏనుగులు మృత్యువాతపడ్డాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments