Webdunia - Bharat's app for daily news and videos

Install App

గత మూడేళ్లలో 329 పులులు మృత్యువాత : కేంద్రం

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (15:50 IST)
దేశ వ్యాప్తంగా గత మూడేళ్ల కాలంలో 329కి పైగా పులులు మృతి చెందినట్టు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా, మంగళవారం లోక్‌సభలో పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇందులో గత మూడేళ్ళ కాలంలో మొత్తం 329 పులులు చనిపోయాయని తెలిపారు. 
 
గత 2019లో 96 పులులు, 2020లో 106, 2021లో 127 చొప్పున ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. వీటిలో ప్రకృతి విపత్తుల కారణంగా 69, ఇతర కారణాల వల్ల 35, వేటాడటం వల్ల 29 చనిపోయినట్టు ఆయన వెల్లడించారు. మిగిలిన 197 పులుల మృతిపై విచారణ జరుగుతుందని చెప్పారు. 
 
ప్రధానంగా గత 2019 కంటే 2021లో పులుల వేట గణనీయంగా తగ్గిందన్నారు. పులుల వేట సాగించే సమయంలో 125 మంది వేటగాళ్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అలాగే, గత మూడేళ్లలో 307 ఏనుగులు విద్యుదాఘాతం, రైలు ప్రమాదాలు, అనారోగ్యం, వేటాడటం వల్ల చనిపోయాయని వివరించారు. 
 
వీటిలో 222 ఏనుగులు విద్యుదాఘాతానికి చనిపోగా, వీటిలో ఎక్కువగా ఒరిస్సా రాష్ట్రంలోనే 41, తమిళనాడులో 34, అస్సాంలో 33 చొప్పున ఏనుగులు మృత్యువాతపడ్డాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రంలో కాకులు తల్వార్ లు పట్టినాయ్.

GV Prakash: జీవి ప్రకాష్‌ బద్దకిష్టా? ఎన్ని గంటలకు నిద్రలేస్తాడో తెలుసా !

మెగాస్టార్ డ్యాన్స్‌కు ఫిదా... ఆ తర్వాత డ్యాన్సర్ అయ్యాను : సాయి పల్లవి

విలన్లు, స్మగ్లర్లు హీరోలుగా చూపిస్తున్నారు: వెంకయ్య నాయుడు చురకలు

స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ ఆరోగ్యంగా ఉన్నారు.. తప్పుడు ప్రచారం వద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments