గత మూడేళ్లలో 329 పులులు మృత్యువాత : కేంద్రం

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (15:50 IST)
దేశ వ్యాప్తంగా గత మూడేళ్ల కాలంలో 329కి పైగా పులులు మృతి చెందినట్టు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా, మంగళవారం లోక్‌సభలో పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇందులో గత మూడేళ్ళ కాలంలో మొత్తం 329 పులులు చనిపోయాయని తెలిపారు. 
 
గత 2019లో 96 పులులు, 2020లో 106, 2021లో 127 చొప్పున ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. వీటిలో ప్రకృతి విపత్తుల కారణంగా 69, ఇతర కారణాల వల్ల 35, వేటాడటం వల్ల 29 చనిపోయినట్టు ఆయన వెల్లడించారు. మిగిలిన 197 పులుల మృతిపై విచారణ జరుగుతుందని చెప్పారు. 
 
ప్రధానంగా గత 2019 కంటే 2021లో పులుల వేట గణనీయంగా తగ్గిందన్నారు. పులుల వేట సాగించే సమయంలో 125 మంది వేటగాళ్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అలాగే, గత మూడేళ్లలో 307 ఏనుగులు విద్యుదాఘాతం, రైలు ప్రమాదాలు, అనారోగ్యం, వేటాడటం వల్ల చనిపోయాయని వివరించారు. 
 
వీటిలో 222 ఏనుగులు విద్యుదాఘాతానికి చనిపోగా, వీటిలో ఎక్కువగా ఒరిస్సా రాష్ట్రంలోనే 41, తమిళనాడులో 34, అస్సాంలో 33 చొప్పున ఏనుగులు మృత్యువాతపడ్డాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments