Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంద్రాగస్టుకు అతిథులుగా 1800 మంది సామాన్యులు

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (13:19 IST)
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే పంద్రాగస్టు పండుగకు 1800 మంది సామాన్యులను అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వీరిలో వివిధ వృత్తుల వారు ఉన్నారు. ముఖ్యంగా, ఈ ఆహ్వానితుల జాబితాలో 400 మంది సర్పంచులు ఉన్నారు. అలాగే, కొత్తగా నిర్మించిన పార్లమెంట్‌ నిర్మాణంలో పాలు పంచుకున్న కూలీలకు కూడా ఇందులో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. 
 
మొత్తం 1800 మంది వ్యక్తులు, వారి జీవిత భాగస్వాములను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. ఈ ప్రత్యేక అతిథుల జాబితాలో 660 గ్రామాలకు చెందిన 400 మంది సర్పంచ్‌లు ఉన్నారు. రైతు ఉత్పత్తిదారులు సంస్థల పథకంలో భాగమైన వారిలో 250 మంది, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 50 మంది, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో మరో 50 మందికి ఆహ్వానం లభించింది.
 
అంతేకాకుండా, కొత్త పార్లమెంట్ భవనంతో సహా సెంట్రల్ విస్తా ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన 50 మంది నిర్మాణ కార్మికులు, ఖాదీ కార్మికులు, సరిహద్దు రోడ్ల నిర్మాణం, అమృత సరోవర్, హర్ ఘర్ జల్ యోజన తయారీలో భాగమైన 50 మంది చొప్పున ఈ వేడుకలకు హాజరుకానున్నారు. అలాగే, 50 మంది చొప్పున ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యుకారులు కూడా ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనే అవకాశం లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments