Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రాష్ట్రంలో పెరిగిపోతున్న పేడ దొంగలు.. తలలు పట్టుకుంటున్న ఖాకీలు

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (10:07 IST)
సాధారణంగా ఇంటి దొంగలు, ముసుగు దొంగలు, దోపిడీ దొంగలు ఇలాంటి వారిని చూసివుంటారు. కానీ, ఆ రాష్ట్రంలో మాత్రం పేడ దొంగలు ఉన్నారు. ఈ పేడ దొంగల వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో ఈ పేడ దొంగలను పట్టుకునేందుకు ఏకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2020లో గౌ-దాన్ న్యాయ యోజన పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా కిలో ఆవు పేడను రెండు రూపాయలకు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటన తర్వాత పేడకు ఎక్కడలేని డిమాండ్ వచ్చేసింది.
 
పేడకు డిమాండ్ పెరగడంతో దొంగతనాలు కూడా అంతేస్థాయిలో పెరిగాయి. దీంతో పేడను కాపాడుకోవడానికి ఎవరికివారు సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. 
 
తాజాగా, అంబికాపూర్ మునిసిపాలిటీలో ప్రభుత్వం గౌ-దాన్ కేంద్రం నుంచి ఆవు పేడను దొంగిలిస్తూ ఐదుగురు మహిళలు పట్టుబడ్డారు. వారి నుంచి 45 కేజీల పేడను స్వాధీనం చేసుకున్నారు. 
 
పెరిగిపోతున్న పేడ దొంగతనాలను అరికట్టేందుకు అధికారులు గౌ-దాన్ కేంద్రం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు అధికారులు రెడీ అవుతున్నారు. అంతేకాదు, పేడను కాపాడేందుకు అక్కడ సెక్యూరిటీ గార్డులను కాపలా కూడా పెట్టాలని నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments