Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాట్నా రైల్వే స్టేషన్ టీవీల తెరపై నీలి చిత్రాల ప్రదర్శన

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (12:18 IST)
బీహార్ రాష్ట్రంలోని పలు రైల్వే స్టేషన్లలలో ఉన్న టీవీలపై నీలి చిత్రాలు అపుడపుడూ దర్శనమిస్తున్నాయి. తాజాగా భాగల్‌పూర్ పట్టణ రైల్వే స్టేషన్‌లోని టీవీ తెరపై సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఉన్నఫళంగా నీలి చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. వీటిని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. 5 నుంచి 10 నిమిషాలు ప్రసారమైన ఆ సమాచారాన్ని కొంతమంది తమ సెల్‍‌ఫోన్లలో చిత్రీకరించగా, మరికొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది టీవీ ప్రసారాలను నిలిపివేశారు. 
 
కాగా, గత మార్చి నెలలో కూడా ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలోని రైల్వే స్టేషన్‌లో ఏకంగా మూడు నిమిషాల పాటు నీలి చిత్రాలు ప్రదర్శితమైంది. ఈ ఉదంతం మరవకముందే భాగల్‌పూర్‌లో మరో అపశ్రుతి చోటుచేసుకోవడం గమనార్హం. ఈ విషయంపై సబ్ డివిజనల్ అధికారి ధనంజయ కుమార్, డీఎస్పీ అజయ్ కుమార్ చౌదరిలు స్పందించి, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments