Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రి బెడ్‌పైనే గంటలపాటు కరోనా రోగి శవం.. స్మశానవాటిక నుంచి పర్మిషన్ రాలేదట!

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (09:47 IST)
Patna Hospital
కరోనా వైరస్‌తో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఓ వైపు ప్రజలు వైరస్ సోకకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు కోవిడ్ సోకిన బాధితుల కష్టాలు అంతా ఇంతా కాదు. వైరస్ సోకిందనే బాధ కంటే ఆస్పత్రుల్లో ప్రభుత్వాలు కల్పిస్తున్న తీరు దారుణంగా ఉంది. ఎందుకు ఈ మాయరోగం మనకు అంటుకుందని చాలామంది బాధపడే స్థాయికి అధికారులు చేర్చుతున్నారు. 
 
ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కరువవయ్యాయి. తాజాగా బీహార్‌లోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఆస్పత్రిలో కరోనాతో ఓ రోగి మరణిస్తే.. శవాన్ని రోగుల మధ్యే గంటల తరబడి వదిలేశారు. దీంతో భయం భయంగానే మిగితా వారంతా కాలం గడపాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పట్నాలోని నలంద మెడికల్ కాలేజీ ఆస్పత్రి ఓ కరోనా బాధితుడు మరణించాడు. 
 
దీంతో అతన్ని మార్చురీకి తరలించకుండా వైద్య సిబ్బంది అతడు ఉంటున్న బెడ్‌పైనే వదిలేసి వెళ్లిపోయారు. గంటలు గడుస్తున్నా ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో ఆ వార్డులో ఉన్న మరో ఏడుగురు రోగులు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో ఆస్పత్రి వర్గాలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీనిపై వైద్య కాలేజీ ప్రిన్సిపల్ స్పందించారు. 
 
బాన్స్ ఘాట్ స్మశానవాటికలో రాత్రి 8 గంటల తర్వాతే అనుమతి ఉండటంతో వారిని అలాగే వదిలేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆయన నిర్లక్ష్యపు సమాధానం మరింత వివాదానికి దారి తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో తాము అక్కడ చికిత్స పొందలేమని రోగులు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments