Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేషన్‌లో పబ్లిగ్గా కానిస్టేబుల్ వక్రబుద్ధి.. ఏం చేశాడంటే...

దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ పట్ల ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తనలోని వక్రబుద్ధిని బయటపెట్టాడు. అదీకూడా పబ్లిగ్గా. సీసీ కెమెరాల్లో నమోదైన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (17:05 IST)
దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ పట్ల ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తనలోని వక్రబుద్ధిని బయటపెట్టాడు. అదీకూడా పబ్లిగ్గా. సీసీ కెమెరాల్లో నమోదైన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
ముంబై కల్యాణ్ నగరంలోని రైల్వే స్టేషన్‌లో ఇద్దరు మహిళలు ఆరో నంబర్ ప్లాట్‌ఫాంపై ఉన్న సీట్లలో కూర్చుని రైలు కోసం ఎదురుచూస్తున్నారు. వీరి పక్కనే జహంగీర్ అనే ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కూర్చుని ఉన్నాడు. జహంగీర్ పక్కన కూర్చున్న మహిళ ఉక్కపోతగా ఉండటంతో చీర కొంగుతో గాలి విసురుకుంటోంది. దీంతో అతని వక్రబుద్ధి బయటపడింది. 
 
అంత మంది స్టేషన్‌లో ఉన్నారన్న ఇంజ్ఞితజ్ఞానం కూడా లేకుండా ఆ మహిళపై కావాలని చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ వికృత చేష్టలను ఆ మహిళ పక్కనే కూర్చున్న మరో మహిళ గమనించింది. ఆ తర్వాత ఆ మహిళ అపర కాళిమాతలా రెచ్చిపోయి కానిస్టేబుల్‌పై దాడి చేసింది. దీంతో మిగిలిన ప్రయాణికులు కూడా తలోచేయి వేసి దేహశుద్ధి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఊడింది. 

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం