Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు అప్పు ఇచ్చింది మేం కాదు: అమిత్ షా

ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన బడాబాబుల ఆస్తుల జప్తుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు కేంద్రం ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన బిల్లును మార్చి 12నే లోక్‌‌సభలో ప్రవేశపెట్టినా ఉభయసభల ప్రతిష్టం

Webdunia
ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (15:28 IST)
ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన బడాబాబుల ఆస్తుల జప్తుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు కేంద్రం ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన బిల్లును మార్చి 12నే లోక్‌‌సభలో ప్రవేశపెట్టినా ఉభయసభల ప్రతిష్టంభన కారణంగా ఆమోదం పొందలేదు. 
 
వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ వంటి ఆర్ధిక నేరగాళ్ల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ఈ ఆర్డినెన్స్‌ వీలు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ ఆర్డినెన్స్‌‌కు ఆమోద ముద్ర పడింది. ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు యూపీఏ హయాంలోనే రుణాలు ఇచ్చారని... ఆ అంశంతో బీజేపీ నేతలెవరికీ సంబంధం లేదన్నారు. 
 
మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో మెగా కూటమిని ఏర్పాటు చేయబోతున్నామని అమిత్ షా తెలిపారు. ప్రస్తుతం ఎన్డీయేలో ఉన్న పార్టీలన్నీ కూటమిలో కొనసాగుతాయని, కొత్త పార్టీలు కూడా వచ్చి చేరబోతున్నాయని తెలిపారు. గత నాలుగేళ్ల మోదీ పాలనలో కుంభకోణాలు చోటు చేసుకోలేదని, బీజేపీ మంత్రులు కానీ, ఎంపీలు కానీ అవినీతి కేసుల్లో ఇరుక్కోలేదని అమిత్ షా చెప్పారు. 
 
21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, దీనికి తమ విధానాలు, పనితీరే కారణమని తెలిపారు. అట్టడుగుస్థాయికి పాలనను తీసుకెళ్లడమే తమ విజయమని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments