విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు అప్పు ఇచ్చింది మేం కాదు: అమిత్ షా

ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన బడాబాబుల ఆస్తుల జప్తుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు కేంద్రం ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన బిల్లును మార్చి 12నే లోక్‌‌సభలో ప్రవేశపెట్టినా ఉభయసభల ప్రతిష్టం

Webdunia
ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (15:28 IST)
ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన బడాబాబుల ఆస్తుల జప్తుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు కేంద్రం ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన బిల్లును మార్చి 12నే లోక్‌‌సభలో ప్రవేశపెట్టినా ఉభయసభల ప్రతిష్టంభన కారణంగా ఆమోదం పొందలేదు. 
 
వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ వంటి ఆర్ధిక నేరగాళ్ల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ఈ ఆర్డినెన్స్‌ వీలు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ ఆర్డినెన్స్‌‌కు ఆమోద ముద్ర పడింది. ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు యూపీఏ హయాంలోనే రుణాలు ఇచ్చారని... ఆ అంశంతో బీజేపీ నేతలెవరికీ సంబంధం లేదన్నారు. 
 
మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో మెగా కూటమిని ఏర్పాటు చేయబోతున్నామని అమిత్ షా తెలిపారు. ప్రస్తుతం ఎన్డీయేలో ఉన్న పార్టీలన్నీ కూటమిలో కొనసాగుతాయని, కొత్త పార్టీలు కూడా వచ్చి చేరబోతున్నాయని తెలిపారు. గత నాలుగేళ్ల మోదీ పాలనలో కుంభకోణాలు చోటు చేసుకోలేదని, బీజేపీ మంత్రులు కానీ, ఎంపీలు కానీ అవినీతి కేసుల్లో ఇరుక్కోలేదని అమిత్ షా చెప్పారు. 
 
21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, దీనికి తమ విధానాలు, పనితీరే కారణమని తెలిపారు. అట్టడుగుస్థాయికి పాలనను తీసుకెళ్లడమే తమ విజయమని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments