Webdunia - Bharat's app for daily news and videos

Install App

IMD: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 25వ తేదీ నుంచి భారీ వర్షాలు

సెల్వి
సోమవారం, 22 సెప్టెంబరు 2025 (10:36 IST)
సెప్టెంబర్ 25వ తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుండటంతో.. తెలంగాణలో సైతం భారీ వర్షాల నమోదుకు అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 25న ఏర్పడే ఈ అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
 
వచ్చే 24 గంటల తర్వాత పశ్చిమ వాయవ్య దిశలో కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం సమీపంలో వాయుగుండంగా మారొచ్చని వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు. 
 
ఇది దక్షిణ ఒడిశా, ఉత్త రాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈ నెల 27వ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
 అల్పపీడనంతో పాటు, ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం, ఈశాన్య ఉత్తరప్రదేశ్, బిహార్‌ ప్రాంతాల్లో మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. 
 
ఈ పరిస్థితుల కారణంగా రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ స్టార్ "ఓజీ" టిక్కెట్ ధర రూ.3.61 లక్షలు

'ఓజీ' చిత్రం అందరినీ రంజింపజేసేలా ఉంటుంది : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

"ఓజీ" బెన్ఫిట్ షో టిక్కెట్ ధర రూ.1.29 వేలు - సొంతం చేసుకున్న వీరాభిమాని

పీఎంవో నుంచి కాల్ వస్తే కల అనుకున్నా : మోహన్ లాల్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ 36వ సినిమా- స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్‌గా లుక్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments