Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీకి శిక్ష జడ్జికి పదోన్నతి.. అడ్డుకున్న సుప్రీం కోర్టు

Webdunia
శనివారం, 13 మే 2023 (10:28 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి శిక్ష విధించిన సూరత్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ హస్‌ముఖ్ భాయ్ వర్మ పదోన్నతిని సుప్రీం కోర్టు అడ్డుకుంది. 
 
ఆయనతో సహా 68 మంది దిగువ కోర్టు న్యాయమూర్తులను జిల్లా జడ్జీలుగా నియమిస్తూ గుజరాత్ సర్కారు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి సీనియారిటీ కమ్ మెరిట్ ప్రాతిపదికన 68 మందికి పదోన్నతలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
గుజరాత్ స్టేట్ జుడీషియల్ సర్వీస్ రూల్స్, 2005ను ఉల్లంఘించి పదోన్నతలు కల్పించారని సుప్రీం కోర్టు తెలిపింది.  ఇది చట్టవిరుద్ధమని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. 
 
పదోన్నతలు పొందిన జడ్జీలందరినీ అంతకుముందున్న స్థానాలకు పంపాలని ఆదేశించింది. పదోన్నతలు ఎలా కల్పించారో చెప్పాలని, మెరిట్ లిస్ట్‌ను తమ ముందు ఉంచాలని గుజరాత్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments