Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైళ్లలో సిగరెట్‌ తాగితే భారీ జరిమానా, ఎంత వేస్తే తాగకుండా వుంటారు?

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (22:33 IST)
దిల్లీ: రైళ్లలో సిగరెట్‌/ బీడీలు తాగే వ్యక్తులకు భారీ జరిమానా విధించేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లిన సందర్భాల్లో అరెస్టులు సైతం చేయాలని యోచిస్తోంది. ఇటీవల జరిగిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోగీ మంటల్లో చిక్కుకోవడానికి సిగరెట్‌ లేదా బీడీ కారణమని ప్రాథమిక నివేదికలు పేర్కొంటున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఆ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
 
ఈ నెల 13న న్యూదిల్లీ- దెహ్రాదూన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌5 బోగీ మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. టాయిలెట్‌లోని డస్ట్‌బిన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్‌/ బీడీ వేయడం వల్ల అక్కడున్న టిష్యూ పేపర్లు నిప్పంటుకుని మంటలు చెలరేగినట్లు విచారణ జరిపిన అధికారులు నిర్ధారణకు వచ్చారు.
 
ఇటీవల రైల్వే బోర్డు సభ్యులతో రైల్వే మంత్రి సమావేశంలో పొగతాగే అంశం చర్చకు వచ్చింది. రైళ్లలో పొగ తాగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. 
ప్రస్తుతం రైళ్లలో పొగతాగితే రూ.100 వరకు జరిమానా విధిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments