రైళ్లలో సిగరెట్‌ తాగితే భారీ జరిమానా, ఎంత వేస్తే తాగకుండా వుంటారు?

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (22:33 IST)
దిల్లీ: రైళ్లలో సిగరెట్‌/ బీడీలు తాగే వ్యక్తులకు భారీ జరిమానా విధించేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లిన సందర్భాల్లో అరెస్టులు సైతం చేయాలని యోచిస్తోంది. ఇటీవల జరిగిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోగీ మంటల్లో చిక్కుకోవడానికి సిగరెట్‌ లేదా బీడీ కారణమని ప్రాథమిక నివేదికలు పేర్కొంటున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఆ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
 
ఈ నెల 13న న్యూదిల్లీ- దెహ్రాదూన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌5 బోగీ మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. టాయిలెట్‌లోని డస్ట్‌బిన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్‌/ బీడీ వేయడం వల్ల అక్కడున్న టిష్యూ పేపర్లు నిప్పంటుకుని మంటలు చెలరేగినట్లు విచారణ జరిపిన అధికారులు నిర్ధారణకు వచ్చారు.
 
ఇటీవల రైల్వే బోర్డు సభ్యులతో రైల్వే మంత్రి సమావేశంలో పొగతాగే అంశం చర్చకు వచ్చింది. రైళ్లలో పొగ తాగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. 
ప్రస్తుతం రైళ్లలో పొగతాగితే రూ.100 వరకు జరిమానా విధిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments