మిజోరంలో అధిక పిల్లలుంటే రూ.లక్ష బహుమతి

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (12:00 IST)
దేశంలోని చాలా రాష్ట్రాలు జనాభా నియంత్రణను కోరుతుంటే.. మిజోరం మాత్రం అందుకు భిన్నంగా జనాభా పెరుగుదలను ప్రోత్సహిస్తూ సంచలన ప్రకటన చేసింది. అధిక సంఖ్యలో పిల్లలున్నవారికి రూ.లక్ష నగదు బహుమానాన్ని కూడా ప్రకటించింది. సర్టిఫికెట్‌, ట్రోఫీ కూడా ఇస్తామని పేర్కొంది.
 
మిజోరం రాష్ట్ర మంత్రి రాబర్ట్‌ రోమావియా రాయ్టే మాట్లాడుతూ... 2011 జనాభా లెక్కల ప్రకారం మిజోరం జనాభా 10,91,014 మంది ఉన్నారని, అతితక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతంగా పేరొందిందని తెలిపారు. మిజో జనాభా తగ్గుతుండటం తనను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు.

ఐజాల్‌ ఈస్ట్‌ -2 అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో సంతానం ఉన్న సజీవ పురుషుడు, లేదా స్త్రీకి లక్షరూపాయల నగదు బహుమతిని ఇస్తామని మంత్రి ప్రకటించారు. దీంతో పాటు సర్టిఫికెట్‌, ట్రోఫీని కూడా ఇస్తామన్నారు.

ఈ ప్రోత్సాహక బహుమతి ఖర్చును మంత్రి కుమారుడి యాజమాన్యంలోని నిర్మాణ కన్సల్టెన్సీ సంస్థ భరించనుంది. మిజో వర్గాల్లో జనాభా పెరుగుదలను ప్రోత్సహించడానికి తన నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో పిల్లలతో నివశిస్తున్న తల్లిదండ్రులకు లక్షరూపాయల నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి రాబర్ట్‌ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments