Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రి అభ్యర్థిగా మమతా బెనర్జీ : బీజేపీ నేత ప్రతిపాదన

Webdunia
ఆదివారం, 6 జనవరి 2019 (16:04 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు చేశారు. మహాకూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ.. పశ్చిమ్‌బంగ రాష్ట్రం నుంచి ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటే.. మమతా బెనర్జీ ఆ పదవికి ఉత్తమ ఎంపిక అని వ్యాఖ్యానించారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ 'ప్రధాని అభ్యర్థిని పశ్చిమ్‌బంగ నుంచి ఎన్నుకుంటే.. మమతానే ఉత్తమ ఎంపిక. ప్రధాని కావాలని ఆమె కలలు కంటున్నారు. ఆమెకు అదృష్టం కలిసి రావాలని కోరుకుంటున్నా. ఆమె ఆరోగ్యంగా ఉండాలి. అయితే వాస్తవ పరిస్థితులు గమనిస్తే.. నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని పదవి చేపడతారు' అని ఘోష్‌ వ్యాఖ్యానించారు. 
 
'గతంలో పశ్చిమ్‌ బంగ నుంచి ప్రధాని అయ్యే అవకాశం జ్యోతిబసుకు వచ్చింది. సీపీఎం అందుకు అంగీకరించలేదు. ఇప్పుడు బెంగాల్‌ నుంచి ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటే.. మమతకే మొదటి అవకాశం' అని వ్యాఖ్యానించారు. గతంలో రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని మమత అడ్డుకున్న విషయాన్ని కూడా ఎవరూ మరిచిపోలేరని ఆయన గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments