కోవిడ్ మాత్రలతో ఎముకలు - కండలు దెబ్బతినే ప్రమాదం : ఐసీఎంఆర్ వార్నింగ్

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (08:42 IST)
తాజాగా దేశంలోకి కరోనా మాత్రలు కూడా అందుబాటులోకి వచ్చాయి. తొలుత అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఈ కరోనా మాత్రల కిట్ ఇపుడు మన దేశంలోకి కూడా వచ్చింది. అయితే, ఈ మాత్రల వల్ల ఎముకలు, కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) చీఫ్ బలరాం భార్గవ హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, మోలు లైఫ్ మాత్రలతో కండరాలు దెబ్బతింటాయని, మోల్నుఫిరవిర్ మాత్రలతో ఎముకలు దెబ్బతింటాయని వివరించారు. ఈ మాత్రలతో జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు (మ్యూటాజెనెసిటీ) వస్తాయని తెలిపారు. 
 
ఇలా జరగడం వల్ల ఎముకలు, కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందుకే ఈ మాత్రలను కోవిడ్ జాతీయ టాస్క్‌ఫోర్స్ చికిత్సా మార్గదర్శకాల్లో చేర్చలేదని గుర్తుచేశారు. ఒకవేళ మహిళల ఈ మాత్రలను వాడితే కనీసం మూడు నెలల పాటు గర్భందాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. 
 
కాగా, కరోనా మాత్రలు మన దేశంలోకి అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ మాత్రలను దేశంలో హెటెరో, డాక్టర్ రెడ్డీస్ సహా 13 ఫార్మా సంస్థలు ఉత్పత్తి చేయనున్నాయి. ఆయా సంస్థలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments