Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ మాత్రలతో ఎముకలు - కండలు దెబ్బతినే ప్రమాదం : ఐసీఎంఆర్ వార్నింగ్

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (08:42 IST)
తాజాగా దేశంలోకి కరోనా మాత్రలు కూడా అందుబాటులోకి వచ్చాయి. తొలుత అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఈ కరోనా మాత్రల కిట్ ఇపుడు మన దేశంలోకి కూడా వచ్చింది. అయితే, ఈ మాత్రల వల్ల ఎముకలు, కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) చీఫ్ బలరాం భార్గవ హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, మోలు లైఫ్ మాత్రలతో కండరాలు దెబ్బతింటాయని, మోల్నుఫిరవిర్ మాత్రలతో ఎముకలు దెబ్బతింటాయని వివరించారు. ఈ మాత్రలతో జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు (మ్యూటాజెనెసిటీ) వస్తాయని తెలిపారు. 
 
ఇలా జరగడం వల్ల ఎముకలు, కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందుకే ఈ మాత్రలను కోవిడ్ జాతీయ టాస్క్‌ఫోర్స్ చికిత్సా మార్గదర్శకాల్లో చేర్చలేదని గుర్తుచేశారు. ఒకవేళ మహిళల ఈ మాత్రలను వాడితే కనీసం మూడు నెలల పాటు గర్భందాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. 
 
కాగా, కరోనా మాత్రలు మన దేశంలోకి అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ మాత్రలను దేశంలో హెటెరో, డాక్టర్ రెడ్డీస్ సహా 13 ఫార్మా సంస్థలు ఉత్పత్తి చేయనున్నాయి. ఆయా సంస్థలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments