Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐబీ ఆఫీసర్ హత్య - లొంగిపోయిన ఆప్ బహిష్కృత నేత

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (15:35 IST)
ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరీ (ఐబీ) అధికారి అంకిత శర్మ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆప్ బహిష్కృత నేత, కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్ పోలీసులకు లొంగిపోయారు. అంకిత్‌ శర్మ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తూ వచ్చిన ఈయన.. గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఢిల్లీ కోర్టులో హుస్సేన్‌ ముందస్తు బెయిల్‌ కోసం మంగళవారం దాఖలు చేసుకున్నారు. ఈ బెయిల్‌ పిటిషన్‌ విచారణను కోర్టు గురువారం విచారణ జరగాల్సివుండగా, ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. 
 
గత నెల 24, 25 తేదీల్లో చాంద్‌బాగ్‌లోని హుస్సేన్‌ నివాసం నుంచి ఘర్షణలు ప్రారంభమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. హుస్సేన్‌ ఇల్లు, ఫ్యాక్టరీ నుంచి యాసిడ్‌ సీసాలతో పాటు పెట్రోల్‌ బాంబులు స్వాధీనం చేసుకున్నారు. 
 
హుస్సేన్‌ నివాసంపై నుంచి ఇతర నివాసాలపైకి పెట్రోల్‌ బాంబులను విసిరినట్లు పోలీసులు నిర్ధారించారు. అంకిత్‌ శర్మ ఫిబ్రవరి 26న హత్యకు గురయ్యారు. ఆయన శరీరంపై సుమారు 400 కత్తిపోట్లు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడైంది. శర్మ హత్య కేసులో హుస్సేన్‌కు సంబంధం ఉందని తేలడంతో.. ఆప్‌ నుంచి ఆయనను సస్పెండ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments