Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్టరేట్‌లోనే మహిళపై కలెక్టర్ అత్యాచారం!

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (08:23 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఓ జిల్లా కలెక్టరే అత్యాచారానికి పాల్పడ్డాడు. అదికూడా కలెక్టర్ కార్యాలయంలోనే ఈ లైంగిక దాడి జరిగింది. కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తిని డిస్మిస్ చేస్తానని బెదిరించి, ఆ వ్యక్తి భార్యపై కలెక్టర్ ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జంగజీర్ చాంఫ్ జిల్లా కలెక్టరుగా పనిచేసిన జనక్ ప్రసాద్ పాథక్ మే 15వ తేదీన కలెక్టరు కార్యాలయంలోనే తనపై అత్యాచారం చేశారని 33 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్తను డిస్మిస్ చేస్తానని బెదిరించి తనను కలెక్టరేట్‌కు పిలిపించి తనపై కలెక్టరు అత్యాచారం చేశాడని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తాము కలెక్టరుపై ఐపీసీ 376, 506, 509బి కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు జంగజీర్ చాంపా జిల్లా ఎస్పీ పారుల్ మాధూర్ చెప్పారు.
 
కాగా, మహిళపై అత్యాచారం చేసిన కలెక్టరుపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లా కలెక్టర్ బాధ్యతల నుంచి తప్పించి, రాష్ట్ర ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టరుగా సర్కారు బదిలీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం