Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొమ్మ పడే విషయంపై జూన్ నెలాఖరులో తుది నిర్ణయం : ప్రకాష్ జావదేకర్

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (08:11 IST)
సినిమా థియేటర్లను తెరిచే అంశంపై జూన్ నెలాఖరులో తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి ప్రకాష్ జావదేకర్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లు, మాల్స్ మూతపడివున్నాయనీ వీటిని తెరిచే అంశంపై ఈనెలాఖరులో కీలక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
 
దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తెరిచే విషయమై జూన్ తర్వాత మాత్రమే ఆలోచిస్తామన్నారు. ఈ నెలలో కోవిడ్ కేసుల సంఖ్యను, పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. సినిమా రంగంలోని వివిధ సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన మంత్రి వివిధ అంశాలపై చర్చించారు. 
 
లాక్డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సందర్భంగా వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సినిమా థియేటర్లను తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లాక్డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ రోజుకు రూ.30 కోట్లకు పైగా నష్టపోతున్నప్పటికీ లాక్డౌన్‌పై సినీరంగం సంఘీభావంగా ఉందని మంత్రి ప్రశంసించారు. సినీ సంఘాల ప్రతినిధులు తన దృష్టికి తీసుకొచ్చిన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి ప్రకాశ్ జావదేకర్ హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments