కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నంత వరకూ ఎన్నికల్లోనూ పోటీ చేయను: ఒమర్ అబ్దుల్లా

Webdunia
సోమవారం, 27 జులై 2020 (14:40 IST)
జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం ఉన్నంత వరకూ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా శపథం చేశారు.

‘‘అత్యధిక కాలం అసెంబ్లీలో శాసన సభ్యుడిగా ఉన్నా. అంతేకాకుండా అసెంబ్లీలో ఆరు సంవత్సరాలుగా నాయకుడిగా ఉండి నడిపించా. అంత బలంగా ఉన్న నేను... ఇంత బలహీనమైన, అధికారం లేని సభలో సభ్యుడిగా ఉండలేను’’ అని స్పష్టం చేశారు.

జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించే అంశం తమ పార్టీకి షాక్ లాంటిదే అని ఆయన ఒప్పుకున్నారు. ఇలా చేయడం ద్వారా జమ్మూ కశ్మీర్ ప్రజలను కేంద్రం తీవ్రంగా అవమానించిందని, ప్రజలకు ఓ రకంగా శిక్ష వేశారని తీవ్రంగా మండిపడ్డారు.

కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు ప్రకటించారో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని అన్నారు. కేంద్ర పాలిత ప్రాంత హోదా కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని, సంపూర్ణ రాష్ట్ర హోదా అనేది త్వరలోనే ప్రకటిస్తామని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments