Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకాలేక సూసైడ్ చేసుకున్న బాలిక

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (16:22 IST)
ఆన్‌లైన్ క్లాసులకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. తరగతిలో ఎపుడూ ఫస్ట్ వచ్చే ఆ బాలిక.. ఇపుడు తమ స్కూల్ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యే అవకాశం లేకపోవడంతో ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన కేరళ రాష్ట్రం జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లాక్డౌన్ కారణంగా పలు విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగిస్తున్నాయి. అయితే, ఇది పేద విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. పూట గడవడానికే ఇబ్బందులు పడే పేద విద్యార్థులు ఆన్‌లౌన్‌ క్లాసుల సౌకర్యాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. 
 
ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరుకావడానికి తన వద్ద టీవీ, స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో ఓ విద్యార్థిని (14) ఆత్మహత్య చేసుకుంది. ఆన్‌లైన్‌ తరగతులకు దూరమవుతున్నానన్న మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది ఆ బాలిక. అనంతరం వాలంచెరిలోని ఇంటి సమీపంలో ఆమె విగతజీవిగా కనపడింది. 
 
ఆమె మృతదేహం పక్కనే  కిరోసిన్ సీసా‌ కూడా ఉంది. పోలీసులు ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆమె స్థానిక పాఠశాలలో  9 వ తరగతి చదువుతోందని తెలిపారు. తరగతిలో ఆ విద్యార్థిని ఎ‍ప్పుడూ ఫస్ట్‌ వచ్చేదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments