Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నను చంపినవారిపై కోపం లేదు... : రాహుల్ గాంధీ

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (08:23 IST)
మా నాన్న ఈ దేశ ప్రధానిగా పనిచేశారు. ఆయన పదవిలో లేనపుడు ఎల్టీటీఈ తీవ్రవాదులు మానవబాంబులుగా మారి హత్య చేశారు. వారిని కూడా ఎపుడో క్షమించేశాం. వారిపై రవ్వంత కూడా కోపం లేదని కాంగ్రెస్ నేత, రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ అన్నారు. 
 
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో పుదుచ్చేరి ఒకటి. దీంతో రాహుల్ గాంధీ తరచుగా తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆయన పాండిచ్చేరిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా, అక్కడి భారతీదాసన్ మహిళా కళాశాల విద్యార్థినులతో ముచ్చటించారు. 
 
ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. ‘‘మీ నాన్నగారిని హత్యచేసిన ఎల్టీటీఈ వ్యక్తులపై మీ అభిప్రాయమేంటి?’’ అన్న ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ.. తన తండ్రి మరణం తనను ఎంతగానో కుంగదీసిందని అన్నారు. 
 
తను ఎవరైనా కోపం కానీ, ద్వేషం కానీ లేదని అన్నారు. హింస వల్ల ఎవరికీ ఒరిగేదేమీ ఉండదని అన్నారు. తన తండ్రిని హత్య చేసిన వారిని తాను క్షమించానని అన్నారు. తన తండ్రి తనలోనే, తనతోనే ఉన్నారని, తన ద్వారా మాట్లాడుతున్నారని రాహుల్ అన్నారు.
 
కాగా, రాజీవ్ హంతకుల విడుదల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్న విషయం తెల్సిందే. వీరిని విడుదల చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశాయి. ఈ దోషుల విడుదల అంశంపై సుప్రీంకోర్టు సైతం రాష్ట్ర గవర్నరుకు డెడ్‌లైన్ విధించింది. అయితే, దోషుల విడుదల అంశం తన పరిధిలోలేదని, రాష్ట్రపతికే ఆ అధికారం ఉందని గవర్నర్ తోసిపుచ్చారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments