Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిని పట్టించుకోకుండా... స్మార్ట్‌ఫోన్‌లోనే చాటింగ్.. భార్య, బిడ్డను చంపేసిన?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (17:44 IST)
స్మార్ట్‌ఫోన్ల పుణ్యంతో అరచేతిలో ప్రపంచం వుందనుకుంటున్నారు చాలామంది. సోషల్ మీడియాను తెగ నమ్మేసి.. వాటి చుట్టే తిరిగేస్తున్నారు. సోషల్ మీడియాను ఎంత మేరకు ఉపయోగించాలో తెలియక బలైపోతున్నారు. అలా ఓ యువతి సెల్‌ఫోన్‌పై వున్న మోజు కారణంగా భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. 
 
వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన రామ్ నగర్ ప్రాంతానికి చెందిన రామ్‌కు రెండేళ్ల క్రితం ఫేస్ బుక్ ద్వారా సుష్మా అనే యువతి పరిచయం అయ్యింది. వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. ఇలా ఫోనుల్లో గంటల పాటు వీరిద్దరూ మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలో సుష్మా తల్లిదండ్రులు ఆమె ప్రేమకు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సుష్మా ప్రేమ కోసం ఇంటి నుంచి బయటికొచ్చి.. ప్రియుడిని వివాహం చేసుకుంది. 
 
వీరిద్దరి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుండగా.. సుష్మ ఎప్పుడూ ఫోనులో గడపటం మొదలెట్టింది. అలా జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంది. ఇంటి పనిని కూడా చేయకుండా ఫోనుతోనే గంటల పాటు గడిపేది. రామ్ ఎంత చెప్పినా, ఎన్నిసార్లు హెచ్చరించినా సుష్మ పట్టించుకోలేదు. ఆపై రాజ్ తన భార్య సెల్‌ఫోన్ చూస్తే.. ఆమె పలువురితో నెట్‌లో చాట్ చేయడం గమనించాడు. 
 
చివరికి రాజ్ థీమ్ పార్క్ వెళ్దామని.. తన భార్య, 3 నెలల బిడ్డతో కలిసి రామ్ వెళ్లాడు. అక్కడికెళ్లాక రామ్ రాక్షసుడిగా మారిపోయాడు. తన భార్యను తైలం చెట్ల మధ్య ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా.. మూడు నెలల పాపాయిని కూడా వదలకుండా హత్య చేశాడు. ఆపై ఆ ఇద్దరినీ దహనం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. 
 
రెండు రోజుల తర్వాత స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంతలో సుష్మతో పాటు తన మూడు నెలల మనవడు కనిపించలేదని సుష్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి సుష్మ భర్తను విచారించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. సుష్మను, మూడు నెలల పసికందును తానే చంపానని చెప్పడంతో సుష్మ తల్లిదండ్రులు, పోలీసులు షాకయ్యారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments