బ్రహ్మణుడని చెప్పి పెళ్లి చేసుకున్నాడు.. శోభనం అయ్యాక నిజం చెప్పాడు...

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (11:33 IST)
కట్టుకున్న భర్త చేతిలో భార్య మోసపోయింది. తాను బ్రహ్మణ కులానికి చెందిన వ్యక్తినని నమ్మించి పెళ్ళి చేసుకున్నాడు. తీరా శోభనం ముగిసిన తర్వాత తాను బ్రహ్మణుడు కాదనే నిజం భార్యకు చెప్పాడు. దీంతో ఆ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బేచ్‌రాజి తాలూకా అడివాడ గ్రామానికి చెందిన ఎక్తాపటేల్ అనే యువతి గత ఏడాది ఏప్రిల్‌లో ఎంకాం విద్యను పూర్తి చేసింది. తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎక్తాపటేల్ మెహసానా ప్రాంతంలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో అకౌంటెంట్‌గా చేరింది. 
 
గ్యాస్ డీలరు జ్యోత్స్నా కుమారుడు యష్‌తో ఎక్తాపటేల్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తాము కూడా బ్రాహ్మణకులానికి చెందిన వారిమని ఏక్తాను యష్ నమ్మించాడు. 
 
దీంతో ఈ యేడాది ఏప్రిల్ 23వతేదీన ఏక్తాపటేల్, యష్‌లు పెళ్లి చేసుకున్నారు. శోభనం తర్వాత తాము బ్రాహ్మణులం కాదనే నిజాన్ని యష్ తన భార్యకు చెప్పాడు. దీంతో తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని పేర్కొంటూ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments