Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రంతా సినిమాలు చూస్తోందని భార్యను చంపేసిన భర్త...

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (17:29 IST)
రాత్రంతా సినిమాలు చూస్తోందని ఓ భార్యను భర్త చంపేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని అంధేరిలో బుధవారం నాడు చోటు చేసుకుంది. చేతన్ చౌఘులే(32), ఆర్తి(22) దంపతులు అంధేరిలో నివాసముంటున్నారు. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. అయితే ఆర్తి నిత్యం సినిమాలు చూస్తోంది. 


అటు టీవీలో కానీ.. ఇటు మొబైల్‌ ఫోన్‌లో కానీ సినిమాలు చూస్తూ ఆర్తి సమయాన్ని గడిపేస్తుంది. ఈ క్రమంలో చేతన్, ఆర్తి మధ్య అనేకసార్లు గొడవలు కూడా చోటు చేసుకున్నాయి. గొడవ జరిగినప్పుడల్లా తన రెండేళ్ల బాబును తీసుకొని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేది. 
 
అయితే రెండు రోజుల క్రితం ఇంటి సరుకులు కొనేందుకు ఆర్తి భర్తను డబ్బులు అడిగింది. అతను ఇవ్వలేదు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా బుధవారం రాత్రి భర్తను విడిచిపెట్టి, ఆ రాత్రంతా యూట్యూబ్‌లో సినిమాలు చూస్తుంది. శబ్దానికి చేతన్‌కు నిద్ర పట్ట లేదు. దీంతో భర్త బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆర్తి గొంతును నులిమి చంపేశాడు. 
 
ఆ తర్వాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి చేతన్‌ లొంగిపోయాడు. తాను రాత్రంతా సినిమాలు చూడడం వల్ల ఆ శబ్దానికి నిద్ర రావడం లేదు. గత కొన్ని రోజులుగా ఇదే జరుగుతుంది. తాను సహనం కోల్పోయి భార్య ఆర్తిని గొంతు నులిమి చంపేశాను అని చేతన్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments