ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్‌ హింసాత్మకం.. కోడెలపై దాడి..

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (17:18 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనుమెట్లలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఏకంగా స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు.


ఆయన చొక్కాను చింపేశారు. ఆయనకు అడ్డుగా నిలిచిన గన్ మెన్లపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కోడెలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
 
మరోవైపు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని వీరాపురంలో టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి.. వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డిలు మరణించారు.
 
ఏపీలో పోలింగ్ బూతుల వద్ద వైసీపీ నేతలు చేస్తున్న దాడులపై టీడీపీ మండిపడింది. ఈ విషయాన్ని సీఈవో ద్వివేది దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులు చేస్తోందంటూ ఆరోపించారు.

ఆయా ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనల జాబితాను ద్వివేదికి అందజేశారు. దాడులకు తెగబడుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ వైసీపీపై ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments