Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్‌ హింసాత్మకం.. కోడెలపై దాడి..

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (17:18 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనుమెట్లలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఏకంగా స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు.


ఆయన చొక్కాను చింపేశారు. ఆయనకు అడ్డుగా నిలిచిన గన్ మెన్లపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కోడెలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
 
మరోవైపు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని వీరాపురంలో టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి.. వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డిలు మరణించారు.
 
ఏపీలో పోలింగ్ బూతుల వద్ద వైసీపీ నేతలు చేస్తున్న దాడులపై టీడీపీ మండిపడింది. ఈ విషయాన్ని సీఈవో ద్వివేది దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులు చేస్తోందంటూ ఆరోపించారు.

ఆయా ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనల జాబితాను ద్వివేదికి అందజేశారు. దాడులకు తెగబడుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ వైసీపీపై ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments