Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ కూతుర్ని చంపేశాను.. వచ్చి డెడ్‌బాడీని తీసుకెళ్లండి..

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (15:36 IST)
కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు దుర్మార్గపు భర్త. హత్య చేసిన తర్వాత అత్తగారికి ఫోన్ చేసి మరీ చెప్పాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సత్నాకు చెందిన మోనూ అతని భార్య పూజల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది. 
 
దీంతో ఆగ్రహానికి గురైన మోనూ భార్యను గొంతునులిమి అనంతరం రాయితో కొట్టి హతమార్చాడు. అనంతరం భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. మీ కూతుర్ని చంపేశాను.. వచ్చి డెడ్‌బాడీ తీసుకెళ్లండి అంటూ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన అత్తమామలు కంగారుగా మోను ఇంటికి పరిగెత్తుకొచ్చారు. ఇంట్లో తమ కుమార్తె రక్తపు మడుగులో పడివుంది. 
 
అయితే అప్పటికీ మోను పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. మోనుని వెతికి పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments