Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలికి అండగా అత్తమామలు.. భర్త చనిపోయినా.. వేరొక వ్యక్తితో..?

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (17:21 IST)
పెళ్లైన ఆరు నెలలకే భర్త చనిపోయాడు. కానీ ఆ వృద్ధ అత్తమామలు.. కోడలికి అండగా నిలిచారు. ఆమెను చదివించి ఉద్యోగం పొందేలా ప్రోత్సహించారు. 
 
అంతటితో ఆగలేదు.. కోడలికి వేరొక వ్యక్తితో వివాహం జరిపించారు. ఈ ఆదర్శ అత్తమామల గురించిన వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన కమలా దేవి, దిలావర్ దంపతుల కుమారుడు శుభమ్‌కు 2016లో సునీత అనే యువతితో వివాహం జరిగింది.
 
వివాహం జరిగిన ఆరు నెలలకే బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో శుభమ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సునీత ఒంటరి అయిపోయింది. పేద కుటుంబానికి చెందిన సునీతను కమలా దేవి దంపతులు వదులుకోలేదు.
 
ఆమెను తమ దగ్గరే ఉంచుకుని చదివించారు. అత్తమామల ప్రోత్సాహంతో సునీత ఎమ్.ఎ.బీ.ఈడీ చదవింది. పోటీ పరీక్ష రాసి జూనియర్ లెక్చరర్‌గా కూడా ఎంపికైంది.
 
సునీత్ జీవితంలో స్థిరపడింది. ఇంకా ఆడిటర్ ముఖేష్‌ అనే వ్యక్తితో సునీతకు పెళ్లి నిర్ణయించారు. గత శనివారం దగ్గరుండి వారి పెళ్లి జరిపించారు. 
 
అత్తమామలను విడిచి వెళ్లేటపుడు సునీత కన్నీళ్లు పెట్టుకుంది. కోడలి పట్ల ఎంతో ఆదరణ చూపించిన కమలా దేవి, దిలావర్ దంపతులపై బంధుమిత్రులు ప్రశంసలు కురిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments