Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ - పార్టీ వీడిన సీనియర్లు

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (12:19 IST)
సీనియర్ రాజకీయ నేత, మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడారు. దీంతో ఆయనకు మద్దతుగా అనేక మంది ఆ పార్టీని వీడుతున్నారు. అంటే గులాం నబీ ఆజాద్ దెబ్బకు జమ్మూకాశ్మీర్‌లోని కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. తాజాగా ఏకంగా 64 మంది నేతలు రాజీనామా చేశారు. 
 
పార్టీని వీడిన సీనియర్ నేతల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి తారాచంద్, మాజీ మంత్రి అబ్దుల్ మాజిద్ వనీ, మనోహర్ లాల్ శర్మ, ఘారు రామ్ తదితరులు ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఉమ్మడిగా లేఖ రాశారు. 
 
"మా నేత, మార్గదర్శి గులాం నబీ ఆజాద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన దారిలోనే మేం కూడా పార్టీని వీడాలని, ఒక సానుకూల రాజకీయ సమాజం కోసం పాటుపడాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే ఆజాద్ ఒక జాతీయ పార్టీని జమ్మూకాశ్మీర్ కోసం ప్రారంభిస్తారు. మేమందరం ఆయనతో కలిసి ఆ పార్టీలో ప్రయాణించాలని, ఆయనకు మద్దతుగా నిలిచి కాశ్మీర్‌కు ఒక మంచి భవిష్యత్‌ను అందిస్తాం" అని ఆ లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments