Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామా అమర జవాన్లకు రూ. 110 కోట్ల భారీ విరాళం... ఆయన దేవుడు కాక మరేమిటి?

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (20:36 IST)
మానవ సేవే మాధవ సేవ అన్నారు. కష్టాల్లో వున్న తోటివారిని ఆదుకున్నవారిలో సాక్షాత్తూ భగవంతుడు కొలువై వుంటాడని అంటారు. అలాంటివారిలో ఓ మహానుభావుడు... పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 110 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఆయన అంధుడు. సైంటిస్ట్.
 
వివరాల్లోకి వెళితే... ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్ఫీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రవాద దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలను ఆదుకునేందుకు దేశ ప్రజలు తమవంతు సాయం చేస్తున్నారు. ఐతే రాజస్థాన్ కోటాకు చెందిన ముర్తజా ఏ అహ్మద్ భారీ సాయం ప్రకటించి అమరవీరుల కుటుంబాల పట్ల దాతృత్వాన్ని చూపారు. 
 
రూ. 110 కోట్లను జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయంగా ఇస్తున్నట్లు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మెయిల్ ద్వారా తెలియజేశారు. ఈయన అంధులైనప్పటికీ శాస్త్ర పరిశోధనలో వినూత్న ఆవిష్కరణలు అందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ఆధునాతన టెక్నాలజీని త్వరలో ఇండియన్ ఆర్మీకి అందించనున్నారు. మరోవైపు భారీ విరాళం ప్రకటించిన ఆయనను ఆ దేవుడు చల్లగా వుండాలని అంటున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments