మమతకు ఓటేయలేదని.. భార్య నోట్లో యాసిడ్ పోసిన భర్త..!

Webdunia
శనివారం, 27 ఏప్రియల్ 2019 (15:04 IST)
పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమత బెనర్జీకి చెందిన అభ్యర్థికి ఓటేయలేదని భార్య నోట్లో యాసిడ్ పోశాడో కిరాతకుడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారపక్షంగా పాలన చేస్తోంది. ఈ పార్టీకి మమత బెనర్జీ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11వ తేదీ పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరిగాయి.
 
ఈ ఎన్నికల్లో ముషీరాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తృణమూల్ కార్యకర్తగా, దీదీకి వీరాభిమానిగా వున్నాడు. ఇతడు ఎన్నికల్లో తన భార్య దీదీ పార్టీకి ఓటేయలేదని తెలుసుకుని కోపంతో ఊగిపోయాడు. మమత పార్టీకి ఓటేయమని ఎన్నిసార్లు చెప్పినా ఆమె పట్టించుకోకపోవడంతో ఆవేశంతో భార్యపై దాడికి దిగాడు. అంతటితో ఆగకుండా నోట్లో యాసిడ్ పోశాడు. 
 
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు బాధితురాలి కుమార్తె ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు తృణమూల్ కార్యకర్తను అరెస్ట్ చేశారు. ఇంకా యాసిడ్ బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments