Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీం ఓకే అంది సరే... ఎంతమంది మహిళలు అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు సిద్ధం?

అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రవేశం నిషేధాన్ని రద్దు చేస్తూ మహిళలందరూ స్వామి సేవలో పాల్గొనవచ్చని తీర్పునిచ్చింది కోర్టు. కోర్టూ తీర్పుపై దేవాలయ ప్రధాన పూజారులు అ

Webdunia
శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (17:03 IST)
అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రవేశం నిషేధాన్ని రద్దు చేస్తూ మహిళలందరూ స్వామి సేవలో పాల్గొనవచ్చని తీర్పునిచ్చింది కోర్టు. కోర్టూ తీర్పుపై దేవాలయ ప్రధాన పూజారులు అసంతృప్తిని వ్యక్తం చేసినా... కోర్టు తీర్పును శిరసా వహిస్తామని తెలిపారు. అన్ని వయసుల మహిళలందరికీ ఆలయ ప్రవేశాన్ని కల్పిస్తామని చెప్పారు. 
 
కానీ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుకు కట్టుబడి ఆలయంలోని పూజారులు అనుమతించేందుకు అంగీకరించినా ఎంతమంది మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారన్నది ప్రశ్నగా వుంది. ఎందుకంటే.. అయ్యప్ప మాల ధరించిన పురుషులను కనీసం తాకేందుకు కూడా మహిళలు భయపడుతుంటారు. 
 
అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ప్రయాణించే రైలు భోగీల్లో సైతం మహిళలు చాలా దూరాన్ని పాటిస్తుంటారు. అయ్యప్ప స్వామి పట్ల అంత విశ్వాసం పాదుకుని వుండింది. ఈ నేపధ్యంలో శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లేందుకు ఎంతమంది మహిళలు ఉత్సాహం చూపిస్తారన్నది ప్రశ్నేనని అంటున్నారు చాలామంది. చూడాలి... శబరిమల ఆలయానికి మహిళా భక్తులు తాకిడి ఏ మేరకు వుంటుందో?

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments