యూపీలో ఘోరం- రక్షాబంధన్ రోజే 14 ఏళ్ల చెల్లిపై అత్యాచారం.. ఆపై హత్య

సెల్వి
గురువారం, 14 ఆగస్టు 2025 (11:21 IST)
Victim
యూపీలో ఘోరం జరిగింది. రక్షాబంధన్‌ రోజే చెల్లి వరుసైన బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడో కామాంధుడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యకు చెందిన 33 ఏళ్ల సుర్జీత్‌ అనే వ్యక్తికి 14 ఏళ్ల బాలిక వరుసకు చెల్లి అవుతుంది. రక్షాబంధన్‌ రోజున బాధితురాలు అతనికి రాఖీ కట్టింది. 
 
అదే రాత్రి, బాగా మద్యం తాగిన  ఇంటికి వెళ్లాడు. గదిలో నిద్రపోతున్న 14 ఏళ్ల బాలికపై సుర్జీత్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను చంపి, మృతదేహాన్ని ఉరికి వేలాడదీశాడు. ఆమె తండ్రి ఇంట్లో వేరే గదిలో నిద్రిస్తుండటంతో పాపం ఈ విషయం అతనికి తెలియకుండా పోయింది. 
 
మరుసటి రోజు  సుర్జీత్‌ ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటికి చేరుకున్న పోలీసులకు అనేక చోట్ల రక్తపు మరకలు కనిపించడంతోనే అది ఆత్మహత్య కాదని తేల్చేశారు. 
 
సుర్జీత్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. బాధితురాలి గోళ్లు, చేతిలో ఉన్న సుర్జీత్‌ వెంట్రుకల నమూనాలతో నిందితుడిని పట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో రక్తపు మరకలతో రైల్వే ఫ్లాట్ పై సంయుక్త ఫస్ట్ లుక్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments