Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్.. హిజ్బుల్ కీలక ఉగ్రవాది హతం

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (10:02 IST)
జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ హతమయ్యాడు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా రిషిపోరా గ్రామం కప్రాన్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 
 
శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్-ఉల్-ముజాహిదీన్ టెర్రరిస్ట్ కమాండర్ నిసార్ ఖండే హతమైనట్టు కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. 
 
ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు, ఓ పౌరుడు గాయపడినట్టు పేర్కొన్నారు. వీరిని తక్షణమే శ్రీనగర్‌లోని 92 బేస్ హాస్పిటల్‌కు తరలించి, చికిత్స అందజేస్తున్నామని చెప్పారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు.
 
ఉగ్రవాది నుంచి ఏకే 47 రైఫిల్‌, పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.  
 
గాలింపులో ఇద్దరు ఉగ్రవాదుల ఆచూకీ లభించిందని, ఆపరేషన్ పూర్తయిన తర్వాత మృతుల సంఖ్యను ప్రకటిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ జరిగిన 56వ ఎన్‌కౌంటర్ ఇది. ఇంతకు ముందు జరిగిన ఆపరేషన్‌లలో 26 మంది పాకిస్థానీలతో సహా 89 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి 
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments