Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో హై డ్రామా.. తలుపులు మూసేసి... మీడియాను బయటకు గెంటేసి... పన్నీర్‌కు స్టాలిన్ జై

తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వం మెజార్టీని నిరూపించుకునే నిమిత్తం శనివారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచారు. ఈ ససమావేశాలు ప్రారంభమవ్వగానే లోపలికి ఎవర్నీ

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (11:57 IST)
తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వం మెజార్టీని నిరూపించుకునే నిమిత్తం శనివారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచారు. ఈ ససమావేశాలు ప్రారంభమవ్వగానే లోపలికి ఎవర్నీ రానివ్వకుండా అసెంబ్లీ తలుపులు మూసివేశారు. ఆఖరికి మీడియాను రాకుండా బయటనే అడ్డుకున్నారు. 
 
దీంతో మీడియా మిత్రులు అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగారు. మీడియాపై ఆంక్షలు విధించడంతో అసెంబ్లీ నుంచి ఎటువంటి సమాచారం బయటికి రావడానికి అవకాశం లేదు. భారీగా పోలీసులు అసెంబ్లీ చుట్టూ మోహరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత మధ్య బలపరీక్ష జరుగుతోంది. 
 
ఇదిలావుండగా, సభ ప్రారంభమైన వెంటనే విశ్వాస పరీక్ష తీర్మానాన్ని సీఎం పళనిస్వామి ప్రవేశపెట్టారు. అసెంబ్లీకి మొత్తం 231మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో డీఎంకే ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. 
 
రహస్య ఓటింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సభలో మాట్లాడేందుకు పన్నీర్‌కు అవకాశం ఇవ్వాలని స్టాలిన్ కోరారు. పన్నీర్‌సెల్వంకే తమ మద్దతని స్టాలిన్ ప్రకటించారు. ఎమ్మెల్యేలను ఖైదీల మాదిరిగా తీసుకొచ్చారని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments