Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా తమ్ముడు ఓ పొరికి... శశికళతో కుమ్మక్కై అత్తను చంపేశాడు: దీపా జయకుమార్

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కోసం అక్కాతమ్ముడు వీధికెక్కారు. జయలలిత ఆస్తులకు సంబంధించి వీలునామా తన వద్ద ఉందంటూ దీపా జయకుమార్ చెపుతుంటే.. కాదుకాదు ఆ వీలునామా తనవద్దే ఉందంటూ ఆమె సోదరుడు దీపక్ చెపుతు

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (09:29 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కోసం అక్కాతమ్ముడు వీధికెక్కారు. జయలలిత ఆస్తులకు సంబంధించి వీలునామా తన వద్ద ఉందంటూ దీపా జయకుమార్ చెపుతుంటే.. కాదుకాదు ఆ వీలునామా తనవద్దే ఉందంటూ ఆమె సోదరుడు దీపక్ చెపుతున్నారు. ఈ ఆస్తి తగాదాలు వీరిద్దరిని రోడ్డున పడేలా చేశాయి.
 
ముఖ్యంగా, తన అనుచరులతో కలిసి పోయేస్ గార్డెన్‌కు వెళ్లిన ఆమెను వేదనిలయంలోకి వెళ్లకుండా ఆమె సోదరుడు దీపక్ అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు.
 
ఈ సందర్భంగా దీపా మాట్లాడుతూ తన మేనత్త జయలలితను శశికళతో కలిసి తన సొంత తమ్ముడు దీపక్‌ చంపేశాడని ఆరోపించారు. శశికళతో కుమ్మక్కై తన సోదరుడే అత్త (జయలలిత)ను అంతమొందించాడని, ఇప్పుడు దినకరన్‌తో చేతులు కలిపి తనను అంతమొందించాలనుకుంటున్నాడని ఆరోపించారు. 
 
పొయేస్ గార్డెన్‌కు రావాలని ఫోన్ చేసిన దీపక్ తాను అక్కడికి చేరుకున్న అనంతరం తనను అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తన తమ్ముడు ఓ పొరికి అని అందుకే ఇలా నడుచుకుంటున్నారని ధ్వజమెత్తారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments