Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమ పైరును కోస్తూ హేమమాలిని ఎన్నికల ప్రచారం

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (11:43 IST)
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అనేక మంది ప్రముఖులు... ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా వివిధ రకాల వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వారిలో బాలీవుడ్ నటి హేమమాలిని ఒకరి. ఈమె భారతీయ జనతా పార్టీ తరపున మధుర లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. 
 
ఈమె తన ఎన్నికల ప్రచారాన్ని మధురలోని గోవర్ధన్‌ క్షేత్రం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కనే ఉన్న గోధుమ పొలంలోకి వెళ్లిన హేమమాలిని కొడవలి చేతబట్టి మిగతా మహిళల మాదిరిగా ఆ పేరును కోశారు. దీన్ని ఆమె ట్వీట్ చేశారు. "గోవర్ధన్‌ క్షేత్ర నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాను. ఇక్కడి మహిళలతో పొలాల్లో కలిసి మాట్లాడడం అదృష్టంగా భావిస్తున్నా"  అని హేమమాలిని ట్వీట్‌ చేశారు.
 
పైగా, తనను ఇక్కడి ప్రజలు అమితంగా స్వాగతిస్తున్నారని, అందుకు తాను గర్విస్తున్నట్టు చెప్పారు. మధుర ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశానని చెప్పారు. 2014 సాధారణ ఎన్నికల్లో కూడా హేమమాలిని ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments