Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్మెట్ ధరించకపోవడంతో చనిపోయిన ముఖ్యమంత్రి భార్య!!

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (10:58 IST)
రాష్ట్ర హోదా కలిగిన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో నిర్బంధ హెల్మెట్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఉత్తర్వులు జారీచేశారు. పైగా, నిర్బంధ హెల్మెట్‌ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆమె స్వయంగా రోడ్లపైకి వచ్చి ప్రచారం చేస్తున్నారు.
 
కానీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాత్రం నిర్బంధ హెల్మెట్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గత రెండు రోజులుగా రాజ్‌భవన్ ఎదుట నిరసనకు దిగారు. 
 
సీఎం వ్యాఖ్యలు కిరణఅ్ బేడీ కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి భార్య ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు.
 
గతంలో స్కూటర్‌పై వెళ్తూ ప్రమాదానికి గురైన ఆమె తలకు దెబ్బ తగలడంతో మృతి చెందారని వివరించారు. కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన బాధాకరమైనదేనని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రోడ్లపై పడి హెల్మెట్ ధరించాలని చెప్పడం నిరంకుశత్వమని సీఎం వ్యాఖ్యానించడాన్ని బేడీ ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments