హెల్మెట్ ధరించకపోవడంతో చనిపోయిన ముఖ్యమంత్రి భార్య!!

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (10:58 IST)
రాష్ట్ర హోదా కలిగిన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో నిర్బంధ హెల్మెట్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఉత్తర్వులు జారీచేశారు. పైగా, నిర్బంధ హెల్మెట్‌ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆమె స్వయంగా రోడ్లపైకి వచ్చి ప్రచారం చేస్తున్నారు.
 
కానీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాత్రం నిర్బంధ హెల్మెట్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గత రెండు రోజులుగా రాజ్‌భవన్ ఎదుట నిరసనకు దిగారు. 
 
సీఎం వ్యాఖ్యలు కిరణఅ్ బేడీ కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి భార్య ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు.
 
గతంలో స్కూటర్‌పై వెళ్తూ ప్రమాదానికి గురైన ఆమె తలకు దెబ్బ తగలడంతో మృతి చెందారని వివరించారు. కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన బాధాకరమైనదేనని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రోడ్లపై పడి హెల్మెట్ ధరించాలని చెప్పడం నిరంకుశత్వమని సీఎం వ్యాఖ్యానించడాన్ని బేడీ ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments