హోం మంత్రి అమిత్ షా తనయుడిని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ!

ఠాగూర్
గురువారం, 5 సెప్టెంబరు 2024 (10:27 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టార్గెట్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షుడుగా జై షా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే. ఈ బాధ్యతలను వచ్చే డిసెంబరు నెల ఒకటో తేదీన చేపట్టనున్నారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, జై షాపై సంచలన ఆరోపణలు చేశారు. 
 
జై షా జీవితంలో ఒక్కసారి కూడా క్రికెట్ బ్యాట్ పట్టుకోకపోయినా ఆయన క్రికెట్‌లో అత్యున్నత పదవిని అనుభవిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, అనంతనాగ్‌లో నిర్వహించిన ప్రచార సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి వీడియోను కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
"ఈ దేశాన్ని ముగ్గురు నలుగురు వ్యాపారవేత్తలు నడుపుతున్నారు. అమిత్ షా కుమారుడు జీవితంలో ఒక్కసారి కూడా క్రికెట్ బ్యాట్ పట్టుకోలేదు. కానీ, ఆయన మాత్రం క్రికెట్‌కు ఇన్‌చార్జ్‌గా ఉంటూ, అంతర్జాతీయ క్రికెట్‌నే శాసించే స్థానంలో ఉన్నారు" అంటూ కామెంట్స్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments