Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం మంత్రి అమిత్ షా తనయుడిని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ!

ఠాగూర్
గురువారం, 5 సెప్టెంబరు 2024 (10:27 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టార్గెట్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షుడుగా జై షా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే. ఈ బాధ్యతలను వచ్చే డిసెంబరు నెల ఒకటో తేదీన చేపట్టనున్నారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, జై షాపై సంచలన ఆరోపణలు చేశారు. 
 
జై షా జీవితంలో ఒక్కసారి కూడా క్రికెట్ బ్యాట్ పట్టుకోకపోయినా ఆయన క్రికెట్‌లో అత్యున్నత పదవిని అనుభవిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, అనంతనాగ్‌లో నిర్వహించిన ప్రచార సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి వీడియోను కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
"ఈ దేశాన్ని ముగ్గురు నలుగురు వ్యాపారవేత్తలు నడుపుతున్నారు. అమిత్ షా కుమారుడు జీవితంలో ఒక్కసారి కూడా క్రికెట్ బ్యాట్ పట్టుకోలేదు. కానీ, ఆయన మాత్రం క్రికెట్‌కు ఇన్‌చార్జ్‌గా ఉంటూ, అంతర్జాతీయ క్రికెట్‌నే శాసించే స్థానంలో ఉన్నారు" అంటూ కామెంట్స్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Shankar: అవతార్ లాగా తన కలల ప్రాజెక్ట్ వేల్పారి చేయబోతున్న తమిళ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments