Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

ఠాగూర్
మంగళవారం, 26 నవంబరు 2024 (11:49 IST)
భోపాల్ నుంచి ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలు ఏకంగా 11 గంటల పాటు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో ఆ రైలులో ప్రయాణించిన ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ రైలు ఇన్ని గంటల పాటు ఆలస్యంగా నడవడానికి సాంకేతిక లోపమే కారణమని అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్‌కు వెల్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులోని రాణి కమలపాటి రైల్వేస్టేషన్ నుంచి సాంకేతిక లోపం కారణంగా 11 గంటల ఆలస్యంగా బయలుదేరింది. 
 
ఈ రైలు సాధారణంగా రాణి కమలాపతి స్టేషన్ నుంచి ఉదయం 5.40 గంటలకు బయలుదేరాల్సివుంది. అయితే, సాంకేతిక లోపం కారణంగా సాయంత్రం బయలుదేరిందని అధికారులు తెలిపారు. దీంతో కోపోద్ర్రిక్తులైన ప్రయాణికులు రైలు పట్టాలపై కూర్చొని తమ నిరసన తెలిపారు. రైలు ఆలస్యం గురించి తమకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అయితే, భోపాల్ డివిజన్ పీఆర్వో నావల్ అగర్వాల్ మాట్లాడుతూ, సాంకేతిక కారణాల వల్ల రైలు ఆలస్యమైందని, అయితే, రైలు సంబంధింత యాప్‌‍లతో సహా పలు మార్గాల ద్వారా రైలు ఆలస్యంపై ప్రయాణికులకు సమాచారం అందించామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments