Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

ఠాగూర్
మంగళవారం, 26 నవంబరు 2024 (11:49 IST)
భోపాల్ నుంచి ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలు ఏకంగా 11 గంటల పాటు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో ఆ రైలులో ప్రయాణించిన ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ రైలు ఇన్ని గంటల పాటు ఆలస్యంగా నడవడానికి సాంకేతిక లోపమే కారణమని అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్‌కు వెల్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులోని రాణి కమలపాటి రైల్వేస్టేషన్ నుంచి సాంకేతిక లోపం కారణంగా 11 గంటల ఆలస్యంగా బయలుదేరింది. 
 
ఈ రైలు సాధారణంగా రాణి కమలాపతి స్టేషన్ నుంచి ఉదయం 5.40 గంటలకు బయలుదేరాల్సివుంది. అయితే, సాంకేతిక లోపం కారణంగా సాయంత్రం బయలుదేరిందని అధికారులు తెలిపారు. దీంతో కోపోద్ర్రిక్తులైన ప్రయాణికులు రైలు పట్టాలపై కూర్చొని తమ నిరసన తెలిపారు. రైలు ఆలస్యం గురించి తమకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అయితే, భోపాల్ డివిజన్ పీఆర్వో నావల్ అగర్వాల్ మాట్లాడుతూ, సాంకేతిక కారణాల వల్ల రైలు ఆలస్యమైందని, అయితే, రైలు సంబంధింత యాప్‌‍లతో సహా పలు మార్గాల ద్వారా రైలు ఆలస్యంపై ప్రయాణికులకు సమాచారం అందించామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments