Webdunia - Bharat's app for daily news and videos

Install App

శభాష్ అనిపించుకున్న హర్యానా బీజేపీ నేత.. కట్నంగా ఒక్క రూపాయి

సెల్వి
బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (11:37 IST)
హర్యానా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కృష్ణ చౌకర్‌ శభాష్ అనిపించుకున్నారు. వరకట్నంగా రూపాయి మాత్రమే తీసుకుని కుమారుడి వివాహం జరిపించారు. సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోన్న చౌకర్ కుమారుడు గౌరవ్‌కు హర్యానా రాష్ట్ర స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఛైర్మన్‌ భూపాల్‌ సింగ్‌ ఖాద్రీ కుమార్తె గరిమాతో వివాహం జరిపించారు. 
 
కట్నంగా వధువు తరపు వారు ఏడు లక్షలకు పైగా వరకట్నం ఇచ్చారు. అయితే ఆ మొత్తాన్ని చౌకర్ సున్నితంగా నిరాకరించారు. సంచిలో నుంచి రూపాయి మాత్రమే తీసుకుని, మిగిలింది వెనక్కి ఇచ్చేశారు. దీంతో అతిథులంతా ఆయనపై ప్రశంసలు కురిపించారు. 
 
ఈ సందర్భంగా కృష్ణ చౌకర్‌ మాట్లాడుతూ.. వరకట్నం సమాజానికి శాపమని అన్నారు. ఇక, తన కుమార్తెకు కట్నంగా ఇచ్చిన సొమ్మును వరుడి కుటుంబం నిరాకరించడంతో వధువు తండ్రి ఆ మొత్తాన్ని ఓ మహిళా కాలేజీకి విరాళంగా అందజేయడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments