Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలువలోకి దూసుకెళ్లిన జీపు... 9 మంది మృత్యువాత (Video)

ఠాగూర్
ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (11:06 IST)
హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఎంతో సంతోషంగా పెళ్లి తంతు కార్యక్రమాన్ని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న కొందరు ప్రమాదంలో చిక్కుకున్నారు. వారంతా ప్రయాణిస్తున్న జీపు అదుపుతప్పి భాక్రా కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలతో పాటు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఫజిల్కా జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో హాజరైన 14 మంది తిరిగి శుక్రవార రాత్రి పొద్దుపోయాక ఓ జీపులో ఇంటికి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో సర్దారేవాలా గ్రామం వద్ద జీపు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, వీరిలో ఐదుగురు మహిళలు, 11 యేళ్ల బాలిక ఉన్నారు. 
 
మంచు దుప్పటి కప్పేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. దారి కనిపించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటివరకు 9 మంది మృతదేహాలను వెలికి తీశారు. మృతులంతా బంధువులు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments