Webdunia - Bharat's app for daily news and videos

Install App

జుట్టు మొత్తం ఊడిపోతుందనీ దారుణం నిర్ణయం తీసుకున్న యువతి..

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (12:45 IST)
తన జట్టు మొత్తం ఊడిపోవడాన్ని ఆ యువతి జీర్ణించుకోలేక పోయింది. దీంతో ఆమె ఓ దారుణ నిర్ణయం తీసుకుంది. వెంట్రుకలు ఊడిపోకుండా ఎన్నో రకాలైన చికిత్సలు చేయించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోవడంతో ఆమె విరక్తి చెందింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది.  ఈ విషాదకర ఘటన కర్నాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మైసూరు నగరంలోని రాఘవేంద్ర ఎక్స్‌టెన్షన్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్ళి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతురాలిని కావ్యశ్రీ (21)గా గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఓ నిజాన్ని గుర్తించారు. 
 
ఆ యువతికి సోకిన వింత జబ్బు కారణంగా తల వెంట్రుకలు పూర్తిగా రాలిపోయాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై నజరాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments