Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవలం మూడు మామిడి పండ్లు మాత్రమే ఆరగించా : కేజ్రీవాల్

వరుణ్
శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (18:03 IST)
తాను జైలులో కేవలం మూడు మామిడి పండ్లు మాత్రమే ఆరగించానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న కేజ్రీవాల్... జైలులో తాను మొత్తం 48 సార్లు భోజనం చేస్తే కేవలం మూడు మామిడిపండ్లు మాత్రమే ఆరగించానని, ఒకసారి ప్రసాదంగా ఆలూ ఆరగించినట్టు చెప్పారు.  జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న తనకు ఇంటి నుంచే మామిడి పండ్లు వచ్చాయని చెప్పారు. 
 
కాగా, తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్.. బెయిల్ కోసం ఉద్దేశ్యపూర్వకంగా మామిడి పండ్లు, ఆలూ, స్వీట్లు తింటున్నారంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో కేజ్రీవాల్ తరపున శుక్రవారం సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ.. కేజ్రీవాల్ భోజనానికి సంబంధించిన వివరాలను సమర్పించారు. 
 
జైల్లో తనకు ఇన్సులిన్ అందించాలని కోరుతూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను వివరాలు సమర్పించారు. కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పెంచుకోవడానికి స్వీట్స్, మామిపండ్లు, ఆలూ తింటున్నారంటూ ఈడీ వాదనలపై అభిషేక్ సింఘ్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలూ కూడా ప్రసాదంగా కేవలం ఒకేసారి మాత్రమే తిన్నారని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జికి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments