Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మ'ను ఆస్పత్రిలో ఒక్కసారి కూడా చూడలేదు.. అమెరికాకు తీసుకెళ్దామంటే...

తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను ఒక్కసారి కూడా చూడలేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చే

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (10:20 IST)
తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను ఒక్కసారి కూడా చూడలేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, అమ్మకు మెరుగైన వైద్యం కోసం అమెరికాకు తీసుకెల్దామంటే అపోలో ఆస్పత్రి యాజమాన్యం వద్దని చెప్పిందని ఆయన ఆరోపించారు.
 
గత 2016 డిసెంబరు నెలలో జయలలిత చనిపోగా, ఆమె మృతి ఓ మిస్టరీగా మారింది. దీనిపై ఏర్పాటైన జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ యేడాది పూర్తి చేసుకున్న సమయంలోనే ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, డీఎంకేకు వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాలో పాల్గొన్న పన్నీర్ సెల్వం... జయలలిత ఆస్పత్రిలో ఉన్నంతకాలం తాను ఆమెను ఒక్కసారి కూడా చూడలేదని వ్యాఖ్యానించారు.
 
అమ్మ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అపోలో వైద్యులను తాను అనేకసార్లు అడిగానని... మరింత మెరుగైన వైద్యం అవసరమనుకుంటే ఆమెను విదేశాలకు తరలించాలని ఆస్పత్రి యాజమాన్యానికి సూచించానని ఓపీఎస్ చెప్పారు. అయితే ఇందుకు ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించలేదని చెప్పారు. జయలలిత తమ ఆధ్వర్యంలోని చికిత్సతో కోలుకుంటారని వారు చెప్పినట్టు పన్నీరు సెల్వం తెలిపారు. పన్నీరు సెల్వం సరికొత్త వ్యాఖ్యలపై అన్నాడీంకేలో సరి్కొత్త చర్చ మొదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments