Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో ర్యాగింగ్ భూతం.. 3 గంటల పాటు నిలబెట్టడంతో వైద్య విద్యార్థి మృతి

ఠాగూర్
మంగళవారం, 19 నవంబరు 2024 (14:44 IST)
గుజరాత్ రాష్ట్రంలో ర్యాగింగ్ భూతం బుసలుకొట్టింది. ఫలితంగా డాక్టర్ కావాలని ఎన్నో ఆశలతో కాలేజీలో అడుగుపెట్టిన ఓ వైద్య  విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. సీనియర్లు... ఆ జూనియర్ విద్యార్థిని ఏకంగా 3 గంటల పాటు ఎండలో నిలబెట్టడంతో స్పృహతప్పి పడిపోయాడు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటనకు సంబంధించిన 15 మంది సీనియర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని జీఎంఈఆర్ఎస్ వైద్య కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 
 
మృతి చెందిన విద్యార్థిని అనిల్ మెథానియగా గుర్తించారు. గుజరాత్ రాష్ట్రంలోని ధారపుర్ పాటన్ ప్రాంతంలోని వైద్య కాలేజీలో చేరాడు. పరియం పేరుతో ద్వితీయ సంవత్సర విద్యార్థులు ప్రెషర్లపై ర్యాగింగ్ చేశారు. ఈ క్రమంలో జూనియర్లను మూడు గంటల పాటు నిల్చోవాలని ఆదేశించారు. దీంతో అనిల్ స్పృహ కోల్పోయి కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. దీంతో ఆందోళన చెందిన సీనియర్లు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, అనిల్ చనిపోయేముందు ఇచ్చిన వాంగ్మూలంలో సీనియర్లు బలవంతంగా నిల్చోబెట్టడం వల్లే ఇలా జరిగిందంటూ వారి పేర్లను వెల్లడించాడు. ఇపుడు వారందరిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కలాం గా ధనుష్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ ఆవిష్కరణ

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments