Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనుషుల్ని కూడా లెక్కచేయరా.. 12కి.మీ అలా లాక్కెళ్లిన కారు.. చివరికి?

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (13:33 IST)
మనుషులను లెక్కచేయకుండా వాహనదారులు లాక్కెళ్తున్న ఘటనలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గుజరాత్ లో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి సాగర్ పాటిల్ అనే 24 ఏళ్ల వ్యక్తి తన భార్య అశ్విని బెన్ తో కలిసి బైకుపై వెళ్తున్నాడు. 
 
కడోదరా-బర్దోలి రోడ్డుపై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఒక కారు వీరి బైకును ఢీకొంది. ఈ ఘటనలో అశ్వినిబెన్ రోడ్డుపై దూరంగా పడిపోయింది. కానీ బైకు నడుపుతున్న సాగర్ మాత్రం కనిపించలేదు. అతడు కారు కింద చిక్కుకున్నాడు. డ్రైవర్ మాత్రం ఆపలేదు. 
 
అలానే కారును ఆపకుండా డ్రైవ్ చేస్తూ వెళ్లిపోయాడు. అలా కారు అతడిని 12 కిలోమీటర్ల మేర లాక్కెళ్లింది. దీంతో కారు కింద చిక్కుకున్న సాగర్ పాటిల్ తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
అతడి మృతదేహాన్ని ఘటనా స్థలానికి 12 కిలోమీటర్ల దూరంలో, కమ్రేజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గుర్తించారు.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వైరల్ వీడియో ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ గారికి నటించడమేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments