Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనుషుల్ని కూడా లెక్కచేయరా.. 12కి.మీ అలా లాక్కెళ్లిన కారు.. చివరికి?

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (13:33 IST)
మనుషులను లెక్కచేయకుండా వాహనదారులు లాక్కెళ్తున్న ఘటనలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గుజరాత్ లో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి సాగర్ పాటిల్ అనే 24 ఏళ్ల వ్యక్తి తన భార్య అశ్విని బెన్ తో కలిసి బైకుపై వెళ్తున్నాడు. 
 
కడోదరా-బర్దోలి రోడ్డుపై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఒక కారు వీరి బైకును ఢీకొంది. ఈ ఘటనలో అశ్వినిబెన్ రోడ్డుపై దూరంగా పడిపోయింది. కానీ బైకు నడుపుతున్న సాగర్ మాత్రం కనిపించలేదు. అతడు కారు కింద చిక్కుకున్నాడు. డ్రైవర్ మాత్రం ఆపలేదు. 
 
అలానే కారును ఆపకుండా డ్రైవ్ చేస్తూ వెళ్లిపోయాడు. అలా కారు అతడిని 12 కిలోమీటర్ల మేర లాక్కెళ్లింది. దీంతో కారు కింద చిక్కుకున్న సాగర్ పాటిల్ తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
అతడి మృతదేహాన్ని ఘటనా స్థలానికి 12 కిలోమీటర్ల దూరంలో, కమ్రేజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గుర్తించారు.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వైరల్ వీడియో ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments