మనుషుల్ని కూడా లెక్కచేయరా.. 12కి.మీ అలా లాక్కెళ్లిన కారు.. చివరికి?

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (13:33 IST)
మనుషులను లెక్కచేయకుండా వాహనదారులు లాక్కెళ్తున్న ఘటనలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గుజరాత్ లో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి సాగర్ పాటిల్ అనే 24 ఏళ్ల వ్యక్తి తన భార్య అశ్విని బెన్ తో కలిసి బైకుపై వెళ్తున్నాడు. 
 
కడోదరా-బర్దోలి రోడ్డుపై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఒక కారు వీరి బైకును ఢీకొంది. ఈ ఘటనలో అశ్వినిబెన్ రోడ్డుపై దూరంగా పడిపోయింది. కానీ బైకు నడుపుతున్న సాగర్ మాత్రం కనిపించలేదు. అతడు కారు కింద చిక్కుకున్నాడు. డ్రైవర్ మాత్రం ఆపలేదు. 
 
అలానే కారును ఆపకుండా డ్రైవ్ చేస్తూ వెళ్లిపోయాడు. అలా కారు అతడిని 12 కిలోమీటర్ల మేర లాక్కెళ్లింది. దీంతో కారు కింద చిక్కుకున్న సాగర్ పాటిల్ తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
అతడి మృతదేహాన్ని ఘటనా స్థలానికి 12 కిలోమీటర్ల దూరంలో, కమ్రేజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గుర్తించారు.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వైరల్ వీడియో ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments