Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో కేజ్రీవాల్‌కు షాక్ - బీజేపీలో చేరనున్న ఎమ్మెల్యేలు

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (15:52 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఐదుగురు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరంతా గుజరాత్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకాకముందే భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయారు. బీజేపీ అధినాయకత్వంతో వీరంతా టచ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. 
 
ముఖ్యంగా, గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో మొన్నిటివరకు బీజేపీ ఎమ్మెల్యేలే. వారికి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వక పోవడంతో ఆప్ పార్టీలో చేరి గెలుపొందారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సృష్టించిన ప్రభంజనంతో వీరు కూడా మళ్లీ కాషాయం గూటికి చేరుకునేందుకు సిద్ధమైపోయారు. 
 
మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేర్చేలా ఒప్పించేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, మొన్నటి ఎన్నికల్లో ఆప్ ఏకంగా 12.92 శాతం ఓట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో ఆప్ ఐదు, బీజేపీ 156, కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలుపొందాయి. 
 
అయితే, గుజరాత్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే ఆప్ తరపున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. గుజరాత్ ఫలితాలతోనే ఆప్ పార్టీకి జాతీయ హోదా దక్కింది. అంతలోనే అది గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments