Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాన్ని వేధించారు.. ఏడుగురికి మూడేళ్ల జైలుశిక్ష.. ఏం జరిగిందంటే..?

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (19:39 IST)
ఓ సింహాన్ని ఏడుగురు వేధించారు. ఇదేంటి? సింహ రాజును మానవులు వేధించడమా అనుకుంటున్నారు కదూ. ఐతే చదవండి. కోడిని ఎరవేసి సింహాంతో పరచకాలాడారు. గుజరాత్‌లోని గిర్ అడవిలో ఓ సింహాన్ని ఏడుగురు వ్యక్తులు వేధించారు. వీరిలో ముగ్గురు టూరిస్టులు కూడా ఉన్నారు. 
 
2018లో ఈ ఘటన జరుగగా వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అహ్మదాబాద్‌కు చెందిన ముగ్గురు పర్యాటకులతో సహా ఏడుగురిని దోషులుగా గిర్ గధాడ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ సునీల్ కుమార్ దేవ్ ప్రకటించారు.
 
వీరిలో ఆరుగురు నిందితులకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, మరొకరికి ఏడాది జైలు శిక్ష ఖరారు చేశారు. గిర్ అడవుల్లో బాబారియా పరిధిలోని ధూంబకారియాలో కొందరు వ్యక్తులు ఓ కోడిని సింహానికి ఎరగా వేసి దాన్ని ఇబ్బంది పెట్టారు. 
 
హింసించి పైశాచికానందం పొందారు. వాళ్లు చేసిన ఈ ఘనకార్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీళ్లు చేసింది వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు 2018 మే నెలలో నిందితులను ఎనిమది మంది నిందితులను అరెస్టు చేశారు. 
 
వన్యప్రాణి రక్షణ చట్టం సెక్షన్ 2 (16) (బి) చట్టం కింద ఆరుగురికి మూడేళ్ల శిక్ష, మరో దోషి మీనాకు సెక్షన్ 27 ప్రకారం ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది. దోషులకు రూ.10వేల చొప్పున జరిమాని విధించింది గుజరాత్ కోర్టు. అనంతరం సింహాల సంక్షేమ నిధికి మరో రూ.35,000 జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

మైఖేల్ జాక్సన్‌కు కలిసిరానిది.. థ్రిల్లర్‌ ఇచ్చిన గిఫ్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments