Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ ముఖ్యమంత్రికి కరోనా వైరస్ సోకిందా?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (16:25 IST)
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కరోనా వైరస్ సోకిందా? సీఎంతో పాటు.. మరో ఇద్దరు మంత్రులతో సమావేశమైన తర్వాత ఓ ఎమ్మెల్యేలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో ముఖ్యమంత్రితో పాటు.. సీఎం కార్యాలయ సిబ్బంది కూడా హడలిపోతున్నారు. 
 
గుజరాత్‌కు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇమ్రానా ఖేడావాలాకు కొద్దిరోజులుగా జ్వరం వస్తున్నది. దాంతో ఆయన కరోనా పరీక్షలకు శాంపిల్ ఇచ్చారు. అయినా ఇంటిపట్టున ఉండకుండా బయట తిరుగుతున్నారు. 
 
ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు మరో ఇద్దరు మంత్రులతో సమావేశమయ్యారు. సీఎం దగ్గరకు వెళ్లడమేకాకుండా తర్వాత ఓ మీడియా సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఎట్టకేలకు కరోనా నిర్ధారణ కావడంతో ఆయన గాంధీనగర్‌లోని ఎస్వీపీ హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేరారు. 
 
ఆయన ఇంకా ఎంతమందిని కలిశారో తెలియడం లేదు. వారందరినీ వెతికి క్వారంటైన్‌లో ఉంచడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే వ్యవహారంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఈ ఉదయం సీఎంతోనూ, ఆరోగ్య, హోంశాఖ మంత్రులతోనూ ఎమ్మెల్యే జరిపిన సమావేశం వీడియోను అధికారులు పరిశీలించగా అందులో పాల్గొన్నవారంతా సామాజిక దూరాన్ని పాటించినట్టు తెలిసింది. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments