Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు డ్రైవర్‌కు గుండెపోటు... తొమ్మిది మంది మృతి

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (10:42 IST)
accident
బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పింది. దీంతో ఎదురుగా వస్తున్న ఎస్‌యూవీ కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మంది వరకు గాయాలపాలైనారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సూరత్‌లో జరిగిన ప్రముఖ్ స్వామి మహరాజ్ మహోత్సవ్‌కు హాజరైన కొందరు తిరిగి సొంతూళ్లకు లగ్జరీ బస్సులో వెళ్తుండగా... శనివారం తెల్లవారుజామున నవ్‌‌సారి జిల్లాలోని వెస్మా గ్రామ సమీపంలోకి వచ్చేసరికి బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో బస్సు అతడి కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న ఎస్‌యూవీ కారును ఢీకొట్టింది.
 
ఈ ఘటనలో కారులో వున్న తొమ్మిది మందిలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో వున్న 28 మంది గాయపడ్డారు. బస్సు డ్రైవర్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments