Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్ల ఏనుగు చనిపోతే.. తల్లి ఏనుగుతో పాటు ఏనుగుల గుంపు ఏం చేసిందంటే? (వీడియో)

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (11:29 IST)
మనచుట్టూ తిరుగుతున్న ఓ వ్యక్తి చనిపోతే.. ఎంతటి బాధ మనుషులకు వుంటుందో.. అదే బాధ మూగ జీవాలను వుంటుంది. బాధకు తాము అతీతులమని కాదని.. తమలోనూ భావోద్వేగాలు వుంటాయని.. తాజాగా ఈ ఏనుగులు నిరూపించాయి. 
 
ఓ ఏనుగు తన బిడ్డ చనిపోతే, దాన్ని మోసుకుంటూ రోడ్డుపైకి వచ్చింది. బాధతో దాన్ని తట్టి లేపేందుకు ప్రయత్నించింది. ఈలోగా, అక్కడికి వచ్చిన మిగతా ఏనుగులు, సంతాప సూచకంగా ఓ నిమిషం పాటు మౌనంగా నిలబడిపోయాయి. ఇంకా తల్లి ఏనుగు.. పిల్ల ఏనుగు మృతదేహాన్ని.. అడవిలోకి తీసుకెళ్లింది. 
 
పర్వీన్ అనే అటవీ అధికారి మొత్తం వీడియోను తీసి, ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. దాదాపు 20 ఏనుగుల గుంపు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇందులో మూడు గున్న ఏనుగులున్నాయి.

ఏనుగుల బృందం అలా పిల్ల ఏనుగును తీసుకెళ్తున్న దృశ్యాన్ని చాలామంది ప్రజలు కూడా వీక్షించారు. తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments